అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తత అవసరం అని రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్ ఎమర్జెన్సీ & సివిల్ డిఫెన్స్ విభాగం ఈ నెల 14 నుండి 20 వరకు నిర్వహించనున్న అగ్ని మాపక వారోత్సవాల నేపధ్యం లో వరంగల్ జిల్లా ఆధ్వర్యం లో రూపొందించిన పోస్టర్ (గోడ పత్రిక) పాంప్లెంట్ (కరపత్రం) ను మంత్రి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ”అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యల గురించి ప్రచారం చేస్తూ ప్రజలను చైతన్యవంతులను చేయడం ఈ వారోత్సవాల ముఖ్య ఉద్దేశం అని అన్నారు. ఒక అతి చిన్న నిప్పురవ్వను అలక్ష్యం చేసినా అది మనకు అతి ఘోరమైన ప్రాణనష్టం, ఆస్తి నష్టం కలిగించవచ్చని, దేశసంపద ధ్వంసం కావచ్చని కాబట్టి అగ్ని విషయంలో ఏమాత్రం అజాగ్రత్త పనికిరాదని సూచించారు. ఏదైనా అగ్ని ప్రమాదము సంబంధించిన తర్వాత చర్యలు తీసుకోవడం కంటే ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల నష్టాన్ని అరికట్టొచ్చని ముఖ్యంగా గృహిణులు దేవుని వద్ద దీపాలు పెట్టే క్రమంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని, షాపింగ్ మాల్స్ హాస్పిటల్స్ ఇండస్ట్రీస్ లలో అగ్నిమాపక విభాగం వారు జాగ్రత్తలను సూచిస్తారని నిర్మాణాలు చేపట్టే క్రమంలో ఖచ్చితంగా వారు సూచించే పద్ధతులను పాటించాల్సి ఉంటుందని అగ్ని ప్రమాదాలు సంభవించినపుడు దాన్ని అరికట్టడానికి ఫైర్ ఫైటింగ్ వంటి ప్రక్రియల ద్వారా అగ్ని కీలలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా చర్యలు చేపడతారని అన్నారు. వేసవి కాలం నేపధ్యం లో అగ్ని ప్రమాదాలు సంబంధించే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఇందుకు సంబంధించి అగ్నిమాపక విభాగం వారు రూపొందించిన కరపత్రాలు గోడపత్రాల ద్వారా ప్రజలు అవగాహన పొంది ప్రమాదాలు సంభవించకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు.ఈ కార్యక్రమంలో నగర మేయర్ గుండు సుధారాణి కార్పొరేటర్ లు ప్రవీణ్ కుమార్ భోగి సువర్ణ సురేష్, మాజీ కార్పోరేటర్ కేడల పద్మజనార్థన్ దిడ్డి కుమారస్వామి డిఎఫ్ఓ కే వి సతీష్ కుమార్ ఎస్ఎఫ్ఓ రాజేశ్వర్ రావు జమేధార్ మాధవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
