జై భారత్ వాయిస్ ఆత్మకూరు)
వాహనదారులు ఎవరైనా మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని ఆత్మకూరు సీఐ సంతోష్ హెచ్చరించారు. ఆదివారం ఆత్మకూరు మండలం నీరుకుల్ల గ్రామంలో గ్రామస్తులతో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో సిఐ సంతోష్ మాట్లాడుతూ వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు .వాటిని గుర్తించామన్నారు. ఎవరైనా మద్యం సేవించి వాహనాలు డ్రైవింగ్ చేస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం తో పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయబడుతుందన్నారు. అన్ని వాహనాలకు రిజిస్ట్రేషన్ డ్రైవింగ్ లైసెన్స్ ఇన్సూరెన్స్, ఫిట్నెస్ పత్రాలు కలిగి ఉండాలన్నారు. పత్రాలు లేని వాహనాలను నడిపిస్తే వాటిని సీజ్ చేసి కేసులు పెడతామన్నారు. ప్రభుత్వాన్నిబంధన ప్రకారం పోలీసుల సూచనలు పాటించి రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చు అన్నారు. నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి వాటిని నివారించవలసిన బాధ్యత అందరి పైన ఉందని పోలీసులకు వాహనదారులు సహకరించాలని సూచించారు. నిర్లక్ష్యం చేస్తే కేసుల పాలవుతారని హెచ్చరించారు. వాహనదారుల నిర్లక్ష్యం వల్ల నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని ఇది ప్రజలు గమనించాలని సూచించారు. ఈ అవగాహన సదస్సులో గ్రామస్తులతో పాటు పోలీసులు పాల్గొన్నారు
