కామారెడ్డి జిల్లా ఎడ్ల పొలాల అమావాస్య సందర్బంగా మద్నూర్ మండలం లోని పెద్ద ఎక్లారా గ్రామంలో శుక్రవారం ఘనంగా ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. ట్రాక్టర్లను అందంగా అలంకరించి ట్రాక్టర్ యజమానులు ఊర్లోని హనుమాన్ మందిరం వద్ద ప్రదక్షణాలు వేసి అనంతరం భారీ ఎత్తున డీజే పాటలతో గ్రామ పుర వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. ఈకార్యక్రమంలో మాజీ పిఏసిఎస్ చైర్మన్ పండిత్ రావు పటేల్,పిఏసిఎస్ చైర్మన్ శ్రీనివాస్ పటేల్, అశోక్ పటేల్, అశోక్ అప్ప రాయికర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.
