క్రీడా పోటీలలో క్రీడాకారులు రాణించాలి
(జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ )
క్రీడలలో క్రీడాకారులు రాణించాలని వరంగల్ జిల్లా ఖానాపూర్
ఎం ఈ ఓ చరణ్ సింగ్ అన్నారు. హనుమకొండ , హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్ లలోని స్పోర్ట్స్ స్కూల్ లలో 4వ తరగతి ప్రవేశాల కోసం క్రీడాపోటీలను మంగళవారం ఎంఈఓ చరణ్ సింగ్ అశోక్ నగర్ లోని సైనిక్ స్కూల్ ప్రాంగణంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడా పాఠశాలల్లో చేరడానికి పేద విద్యార్థులకు ఇది అద్భుతమైన అవకాశమని విద్యార్థులలో క్రీడా ప్రతిభను వెలికితీసే విధంగా ఈ పాఠశాలల నిర్వహణ ఉంటుందని తెలిపారు. భవిష్యత్తులో దేశానికి ఉత్తమ క్రీడాకారులను అందించే దిశగా ఈ పాఠశాలలు నడుస్తాయని పేర్కొన్నారు. తల్లిదండ్రులు , ఉపాధ్యాయులు విద్యార్థులలో ఆసక్తి , ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలని సూచించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు , విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సైనిక్ స్కూల్ ప్రిన్సిపాల్ గట్ల సురేందర్ , పీడీ లు సుభద్ర ,శ్రీనివాస్ , దేవేందర్ గైడ్ ఉపాధ్యాయులు బాలోజీ, చంద్రమౌళి, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.


